న్యూఢిల్లీ : గత నెలలో ప్రారంభించిన ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ల్లో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 814 ట్యాంకర్లలో 13,319 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఓ)ను సరఫరా చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. 208 ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లు తమ ప్రయాణాన్ని పూర్తి చేయగా.. మరో 13 ట్రైన్లు 1,108 టన్నుల ఆక్సిజన్ను లక్ష్యం దిశగా ప్రయాణిస్తున్నాయని రైల్వే మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గత కొద్ది రోజుల్లో ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఇప్పటివరకు 13 రాష్ట్రాలకు సరఫరా చేశాయని పేర్కొంది.
ఉత్తరాఖండ్కు 320 టన్నులు, కర్ణాటకకు 714, మహారాష్ట్రకు 614, మధ్యప్రదేశ్కు 521, ఆంధ్రప్రదేశ్కు 292, రాజస్థాన్కు 98 టన్నులు, తమిళనాడుకు 649, హర్యానాకు 1,619, తెలంగాణకు 772, పంజాబ్కు 153, కేరళకు 118, ఢిల్లీకి 4,110, ఉత్తర ప్రదేశ్ 3,338 టన్నులు ల్వికిడ్ ఆక్సిజన్ సరఫరా చేసినట్లు చెప్పింది. రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా ఆక్సిజన్ రైళ్లు నడుపనున్నట్లు పేర్కొంది. ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ఏప్రిల్ 19న ప్రారంభమైంది. ఖాళీ ట్యాంకర్లతో ముంబై నుంచి బయలుదేరిన ట్రైన్.. 24న 136 టన్నుల ప్రాణవాయువుతో మహారాష్ట్రకు చేరింది.