గోల్నాక, సెప్టెంబర్ 13 : ఇటీవల గోల్నాక డివిజన్ పెరెల్గార్డెన్ పంక్షన్ హాల్లో ప్రమాదవశాత్తు గోడ కూలి ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, సోమవారం జీహెచ్ఎంసీ మేయర్ కార్యాలయంలో స్థానిక కార్పొరేటర్ దూసరి లావణ్యతో కలసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరిహారం అందజేశారు.
బాధిత మృతుల కుటుంబ సభ్యులు జరేనా సుల్తానా, పెద్ద వెంకట్, రాములు తదితరులకు నష్ట పరిహారం కింద రూ.2లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నర్సింగ్యాదవ్, రాజు, అబ్బు, ఉమేష్, ప్రణీత్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.