సిటీబ్యూరో, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని గేటెడ్ కమ్యూనిటీల్లో నివాసం ఉంటున్న వారితో పోలీసు కమిషనర్ సజ్జనార్ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని, అర్హత ఉన్నవారు టీకా తీసుకోవాలని, అనవసరంగా బయట తిరుగొద్దని, ఇతర వ్యక్తులను సముదాయాల్లోకి అనుమతించొద్దని’ ఈ సందర్భంగా సీపీ సూచించారు. ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని కోరారు.