సుల్తాన్బజార్, ఏప్రిల్ 27: కింగ్ కోఠి జిల్లా దవాఖానాలో కొవిడ్ రోగులకు అందుతున్న వైద్య సేవల పట్ల హైదరాబాద్ జిల్లా కలెక్టర్ పూర్థి స్థాయిలో సంతృప్తి వ్యక్తపరిచారు. ఈ మేరకు మంగళవారం దవాఖానాలో ఆమె ఆకస్మికంగా పర్యటించి రోగులతో నేరుగా కలిసి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, రోగులకు అందుతున్న ఆక్సిజన్ను దవాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ రాజేందర్నాథ్, అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ జలజ, ఆర్ఎంవో డాక్టర్ విరజ, కొవిడ్ కోఆర్డినేటర్ డాక్టర్ మల్లికార్జున్లతో కలిసి స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం వార్డులలో పర్యటించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు.
ఈ సందర్భంగా దవాఖానాలో లిక్విడ్ ఆక్సిజన్ స్థాయి ఎంత నిల్వ ఉంది? నిత్యం రోగుల నిమిత్తం ఎంత ఆక్సిజన్ స్థాయిని ఉపయోగిస్తున్నారు? అని అడగగా, సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్, అడిషనల్ సూపరింటెండెంట్ జలజలు పూర్తి స్థాయిలో వివరించారు. దవాఖానాలో ఎనిమిదివేల లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ నిల్వ ఉందన్నారు. ప్రస్తుతం నిత్యం మూడువేల లీటర్ల ఆక్సిజన్ను రోగుల నిమిత్తం ఉపయోగించడం జరుగుతుందని కలెక్టర్కు వారు వివరించారు. దీంతో కలెక్టర్ శ్వేతా మహంతి రోగులకు అందిస్తున్న సేవల పట్ల ఆక్సిజన్ అవసరమైన రోగులకు దగ్గరుండి అప్యాయతగా అందిస్తున్న సేవలపై ఆమె వైద్యులను ప్రత్యేకంగా అభినందించారు.