కొవిడ్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శ్వేతామహంతి వెల్లడించారు. జిల్లా వైద్యాధికారులతో కలెక్టరేట్లో గురువారం ప్రత్యేకసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు తాత్కాలిక ప్రాతిపాదికన వైద్యసిబ్బందిని నియమిస్తామని తెలిపారు. జిల్లాలోని యూపీహెచ్సీలు, గాంధీ ఇతర వైద్యశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను (డాక్టర్లు, మెడికల్ ఆఫీసర్లు, హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, డీఈవో, ల్యాబ్ టెక్నీషియన్స్) తాత్కాలిక ప్రాతిపదికన నియమిస్తామని తెలిపారు. అందుకు అవసరమైన అనుమతులను కలెక్టర్ మంజూరు చేశారు. సమావేశంలో డీఎంహెచ్వో డాక్టర్ వెంకటి, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ రాజారావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.