బండ్లగూడ,ఆగస్టు 17 : రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ఆరంఘర్ నుంచి శంషాబాద్ వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు అందరూ సహరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ అన్నారు. మంగళవారం రాజేంద్రనగర్ ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, ఆర్డీవో చంద్రకళ, తహసీల్దార్లు చంద్రశేఖర్, జనార్ధన్, మత పరమైన దేవాలయ, మసీద్ కమిటీ సభ్యులు, మత పెద్దలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారి ఎన్హెచ్ 44 ఆరు లేన్ల రహదారి నిర్మాణం కోసం చేపడుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా మత పరమైన దేవాలయాలు, మసీదులను జరుపాల్సి వస్తే మత పెద్దలు సహరించాలన్నారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మత పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, సమయం పడుతుందని తెలిపారు. ఇందుకు కలెక్టర్ సరే అని వచ్చే నెల 3వ తేదీకి సమావేశం వాయిదా వేశారు.