బొల్లారం,ఆగస్టు 23 : కరోనా మహామ్మారిని తరిమికొట్టడానికి వందశాతం లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇంటి వద్ద టీకా ఇచ్చే కార్యక్రమానికి బల్దియాతో పాటు కంటోన్మెంట్ లో పది రోజుల పాటు ఇంటింటికి వ్యాక్సినేషన్ ఇచ్చే పక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా సోమవారం కంటోన్మెంట్ వ్యాప్తంగా 360 కాలనీ, బస్తీలు ఆశావర్కర్లు, ఏఎన్ఎమ్, అంగన్వాడీ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ వేసుకోని వారి జాబితా సేకరించారు.
దీంతో పాటు వ్యాక్సిన్ తీసుకోని పౌరులకు తమ కాలనీలో ఏ రోజైతే ప్రత్యేక వ్యాక్సిన్ అందజేసే బృందం వస్తుంది, ఎక్కడికి, ఏ సమయంలో అనే వివరాలను సిబ్బంది వివరించారు. కంటోన్మెంట్ ఎనిమిదో వార్డు సరస్వతి నగర్, మల్లారెడ్డి నగర్,వెంకటేశ్వర్ కాలనీల్లో సర్వే నిర్వహించారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు కొంతమంది ఆనారోగ్య రీత్యా ఇంత వరకు టీకా వేసుకోన్నట్లుగా తెలిపారు. కార్యక్రమంలో మెడికల్ అధికారి డాక్టర్ అరుణ్ కుమర్, వైద్య సిబ్బంది బాలమణి, షీబా రాణి ,ఆశా వర్కర్లు రేణుక, శ్రీలత, మీన, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.