గోల్నాక, సెప్టెంబర్ 8 : అనారోగ్యానికి గురై పలు దవాఖానాల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని ఎమ్మెలే కాలేరు వెంకటేశ్ అన్నారు. బుధవారం గోల్నాకలోని ఆయన క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను ఆయన అందజేశారు.
అంబర్పేట డివిజన్ ఆజాద్నగర్కు చెందిన అజ్మతున్నీసాకు రూ. 2లక్షలు, అంబర్పేట బాపునగర్కు చెందిన నూర్జాన్ బేగంకు రూ. 23వేలు, సైదాబాద్ మాదన్నపేటకు చెందిన ఎన్.రాజుకు రూ.12వేతు, బాగ్అంబర్పేట తురాబ్నగర్కు చెందిన అజీజా బేగంకు రూ. 14వేలు, చార్మినార్ ఖాజీపూరకు చెందిన రహ్మత్బీకు రూ52వేలు, కాచిగూడకు చెందిన మధుసూదన్కు రూ.60వేలు, హియాయత్నగర్ దత్తనగర్కు చెందిన బేగంకు రూ.40వేలు, బాగ్అంబర్పేట పోచమ్మబస్తీకి చెందిన శ్రీకాంత్కు రూ.25వేలు, అంబర్పేట పటేల్నగర్కు చెందిన పి.గణేష్కు రూ.36వేలు, నాంపల్లికి చెందిన ప్రసాద్కు రూ.60వేలు, ఇసామియాబజార్కు చెందిన కనకయ్యకు రూ. 24వేలు, అంబర్పేట న్యూప్రేమ్నగర్కు చెందిన బిపాషాకు రూ. 24వేలు, బాగ్అంబర్పేట మల్లికార్జుననగర్కు చెందిన వి.కృష్ణారావుకు రూ. 60వేలు, అంబర్పేట పటేల్బాడాకు చెందిన నసీంబేగంకు రూ. 36వేలు, అంబర్పేట బాపునగర్కు చెందిన వేణుగోపాల్కు రూ.60వేలు, మొత్తం రూ.7లక్షల 73వేల విలువగల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారిందన్నారు. కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.