శంషాబాద్ రూరల్ : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. గురువారం శంషాబాద్ మండలంలోని రషీద్గూడ గ్రామానికి చెందిన యాదిరెడ్డి (60,000), పోశేట్టిగూడ గ్రామానికి చెందిన బి లహారి (60,000) లకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ పేదలకు వైద్య ఖర్చులకు సహాయం అందించడానికి సీఎం రిలీఫ్ ఫండ్ దోహదపడుతుందన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ముందుచూపుతో రాష్ట్రంలోని ఎంతోమంది పేదలకు నాణ్యమైన వైద్యమందించి కాపాడుతున్నట్లు వివరించారు.
కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కే చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్రావు,నీరటి రాజు ముదిరాజ్,సర్పంచ్ మంచాల రాణిరవి,ఉప సర్పంచ్ జగన్మోహన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దవణాకర్గౌడ్, వార్డు సభ్యులు మల్లారెడ్డి, నాయకులు ధన్పాల్రెడ్డి, జనార్ధన్,యాదయ్య, కుమార్,నర్సింహ, రాజు,అంజి,రఘు తదితరులు పాల్గొన్నారు.