గోల్నాక, ఆగస్టు 29 : అనారోగ్యానికి గురై పలు దవాఖానాల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని ఎమ్మెలే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఆదివారం గోల్నాకలోని ఆయన క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను ఆయన అందజేశారు.
మూసారాంబాగ్కు చెందిన కె.పద్మావతికి రూ.33వేలు, అంబర్పేటకు చెందిన షాన్వాజ్బేగంకు రూ. 8వేలు, కాచిగూడ నింబోలిఅడ్డకు చెందిన ఎస్.శంకరప్పకు రూ. 6వేలు, అంబర్పేట అంబేద్కర్నగర్కు చెందిన బి.లింగయ్యకు రూ. 60వేలు, నల్లగొండకు చెందిన పి.అరుణకు రూ. 19వేలు, బాగ్అంబర్పేట తురాబ్నగర్కు చెందిన జి.ప్రవీణకు రూ. 29వేలు, అంబర్పేట పటేల్నగర్కు చెందిన మహ్మద్ అస్గర్కు రూ. 54వేలు, వరంగల్కు చెందిన సయ్యద్ అంకుష్కు రూ.24వేలు, హనుమకొండకు చెందిన మస్రత్ బేగంకు రూ.27వేల విలువగల చెక్కులను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారిందన్నారు. కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.