అమీర్పేట్ : సనత్నగర్ డివిజన్ సాయిబాబానగర్కు చెందిన ప్రభాకర్ గత కొంత కాలంగా అస్వస్థతకు గురై శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది. ప్రభాకర్ కుటుంబ సభ్యులు సనత్నగర్ డివిజన్ అధ్యక్షులు కొలను బాల్రెడ్డి చొరవతో సీఎం సహయ నిధికి దరఖాస్తు కోగా.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సిఫారసు మేరకు రూ. 60 వేల చెక్కు మంజూరైంది. ఈ చెక్కును లబ్ధిదారు గురువారం కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.