సిద్దిపేట : సిద్దిపేటలో కొవిడ్ వైద్య సేవలందిస్తున్న సిద్ది వినాయక ఆస్పత్రిలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధిక మొత్తంలో రోగుల నుంచి డబ్బులు వసూలు చేయడంపై ఆస్పత్రి యాజమాన్యంపై ఖాన్ మండిపడ్డారు. డిశ్చార్జి అయిన రోగులతో అడిషనల్ కలెక్టర్ మాట్లాడి ఫీజు వివరాలను తెలుసుకున్నారు. దీంతో డబ్బు ఎక్కువగా వసూలు చేసినట్లు తేలింది. రికార్డులను కూడా పరిశీలించారు. చికిత్స ఖర్చుకు మించి వసూలు చేసిన డబ్బును రోగులకు తక్షణమే తిరిగి ఇచ్చేయాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని ఖాన్ ఆదేశించారు. అధికంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.