“తెలంగాణ ఏర్పడ్డాక ఆర్టీసీని కాపాడుకుంటున్నం.. బడ్జెట్లో మూడు వేల కోట్లు కేటాయించాం. ప్రతి నెలా నిధులను విడుదల చేస్తున్నం. ఆర్టీసీ ఉద్యోగులు కూడా జీతాలు పెంచాలంటున్నరని.. రవాణా శాఖ మంత్రితో చర్చించి జీతాలు పెంచుతం. త్వరలోనే ఆర్టీసీ సిబ్బంది జీతాల పెంపు ఉంటుంది.” అని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడంతో ఆర్టీసీ సిబ్బంది మస్తు ఖుషీ అయ్యారు. ఆర్టీసీకి మంచి రోజులొచ్చాయంటూ సంతోషం వ్యక్తం చేశారు. సీఎం ప్రకటన ఊహించలేదని చెప్పారు. డ్రైవర్లు, కండక్టర్లు, డిపో మేనేజర్లు, ఇతర సిబ్బంది జై సీఎం అంటూ నినాదాలు చేస్తూ సంబురాలు జరుపుకున్నారు.
ఉద్యోగ బంధు సీఎం కేసీఆర్
ఆర్టీసీ సిబ్బంది జీతాలు పెంచుతానని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. మేము అస్సలు ఊహించలేదు. మా కష్టాలు తెలిసిన సీఎం కాబట్టే త్వరలో జీతాలు పెంచుతామని హామీచ్చారు. మొన్న బడ్జెట్లో మూడువేల కోట్లు వెచ్చించి.. ఇవ్వాళ సిబ్బంది జీతాలు పెంచుతామని చెప్పడం గొప్ప విషయం. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. – పటాపంచలు ఓ.సుధ, అసిస్టెంట్ మేనేజర్, ఎంజీబీఎస్
సీఎం కేసీఆర్కు హ్యాట్సాఫ్
కరోనాకాలంలో ఆర్టీసీ మరిం త నష్టంలో ఉన్నప్పటికీ.. బడ్జెట్ లో సముచిత స్థానం కల్పించా రు. ఆర్టీసీ సిబ్బంది జీతాలు కూ డా పెంచుతామని సీఎం ప్రకటించారు. ఆర్టీసీ మూసే పరిస్థితిలో ఉంది. ఇంకా జీతాలు ఏం పెంచుతామని గత పాలకులు విమర్శించేవాళ్లు. జీతాలు పెంచమని అడగాలంటే భయం వేసేది. కానీ, సీఎం పెద్ద మనసు చేసుకుని జీతాలు పెంచుతామనడం గొప్ప విషయం. – టి.రవీందర్ రావు, కండక్టర్