న్యూయార్క్ : అమెరికన్ సెనేట్లో మెజార్టీ సాధించేందుకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మద్దతుదారులలో కింగ్ మేకర్గా తన పాత్రను పరిచయం చేశారు. 2022 లో సెనేట్కు జరుగనున్న ఎన్నికలలో రిపబ్లికన్లకు విజయం సాధించడం ద్వారా సెనేట్లో పూర్తి మెజారిటీ లభించేలా చూడాలని ఆయన సూచించారు. ట్రంప్ తన పామ్ బీచ్ మార్-ఎ-లాగోలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ విషయం చెప్పారు.
ట్రంప్ పామ్ బీచ్ హౌస్లో జరిగిన సమావేశానికి రిపబ్లికన్ జాతీయ కమిటీ నుంచి పలువురు సీనియర్ నేతలు, దాతలు హాజరయ్యారు. రిపబ్లికన్ పార్టీ భవిష్యత్తును నిర్ణయించడానికి మనమందరం ఇక్కడ సమావేశమయ్యామని ట్రంప్ అన్నారు. 2022 ఎన్నికల్లో సెనేట్ సీట్లు గెలవడమే మన ముందున్న లక్ష్యమని, ఇది మనకు సెనేట్లో మెజారిటీని కలిగి ఉండటానికి అనుమతిస్తుందన్నారు.
2022 లో జరిగే సెనేట్ ఎన్నికల గురించి మాట్లాడిన ట్రంప్.. అయితే, 2024 అధ్యక్ష ఎన్నికల గురించి ఏమీ మాట్లాడలేదు. కానీ, రానున్న అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీలో ఉంటానని గతంలోనే ట్రంప్ ప్రకటించారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అధికారులపై ట్రంప్ పరిపాలన విధించిన ఆంక్షలు, వీసా ఆంక్షలను ఎత్తివేశారు.
తొలిసారిగా అంతరిక్షంలో కాలిడిన యూరి గగారిన్.. చరిత్రలో ఈరోజు
మూడు రాష్ట్రాల్లో కొవిడ్ చర్యల్లో లోపాలు : గుర్తించిన కేంద్ర బృందాలు
స్మగ్లర్ల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి
ఎంసీడీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు షాక్
ధైర్యం, థ్రిల్, పోటీ స్ఫూర్తి ఉన్న పురుషులే మంచి తండ్రులు
అమెరికాలో కరోనా మహమ్మారి నాలుగో వేవ్..?!
అక్రమ ఆయుధ మార్కెట్: గన్ కావాలా పెషావర్ రండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..