జూబ్లీహిల్స్,సెప్టెంబర్8 : పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుడి విగ్రహాలను వినియోగించాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పేర్కొన్నారు. కరోనాను కట్టడిచేయడంతో పాటు కాలుష్యం బారిన పడకుండా కాపాడుకోవాల్సిన భాద్యత అందరిపై ఉందని అన్నారు. బుధవారం యూసుఫ్గూడ డివిజన్ కృష్ణా నగర్ లేబర్ అడ్డా వద్ద మట్టి వినాయక ప్రతిమలను భక్తులకు, ప్రజలకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించే వినాయక చవితిని కుటుంబ సమేతంగా సంతోషంగా జరుపుకోవడంతో పాటు కాలుష్యరహిత మట్టి ప్రతిమలతో సమాజానికి సందేశాన్నివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బండారి రాజ్ కుమార్ పటేల్, పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.