జిల్లా వ్యవసాయాధికారి హుక్యానాయక్
మూసాపేట, ఏప్రిల్12: కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకొచ్చే సమయంలో నాణ్యతా ప్రమాణాలు తప్పకుండా పాటించాలని జిల్లా వ్యవసాయాధికారి హుక్యానాయక్ సూచించారు. గురువారం మండలంలోని జానంపేట గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని, రైతువేదికను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ గోపాల్యాదవ్, జిల్లా డైరెక్టర్ లక్ష్మినర్సింహాయాదవ్, ఏడీఏ యశ్వంత్రావు, ఏవో రాజేందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.
నాణ్యమైన ధాన్యాన్నే కొంటాం
ఏడీఏ యశ్వంత్రావు
భూత్పూర్, ఏప్రిల్ 23: నాణ్యమైన ధాన్యాన్నే కొంటామని దేవరకద్ర ఏడీఏ యశ్వంత్రావు అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రైతులు కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యంలో తాలు, తేమ లేకుండా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, సింగిల్విండో చైర్మన్ అశోక్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్తూర్నారాయణగౌడ్, సీఈవో రత్నయ్య, ఏఈవో హర్షవర్ధన్గౌడ్, నాయకులు సత్తూర్ చంద్రశేఖర్గౌడ్, సత్యనారాయణ, అశోక్గౌడ్, అజీజ్, గడ్డంరాములు, తిరుపతయ్యగౌడ్ పాల్గొన్నారు.