చార్మినార్, ఆగస్టు 5 : డిగ్రీ కళాశాల ప్రవేశాల్లో సిటీ కాలేజీకి అనూహ్య స్పందన లభించిందని సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ బాలభాస్కర్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. సిటీ కాలేజీకి ప్రభుత్వం 1500 సీట్లు కేటాయించిందన్నారు. డిగ్రీ ప్రవేశాల్లో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన దోస్త్ అప్లికేషన్ను ఉపయోగించుకున్న విద్యార్థులు సిటీ కాలేజీని అత్యధిక సంఖ్యలో ఎంచుకున్నారన్నారు. ఫలితంగా ఫేజ్-1లోనే సిటీ కాలేజీలో ప్రభుత్వ అనుమతుల మేరకు 1500 సీట్లను విద్యార్థులకు కేటాయించినట్లు ప్రిన్సిపాల్ బాల భాస్కర్ తెలిపారు. దోస్త్ కన్వీనర్, కళాశాల విద్య కమిషనర్ సూచించిన విధంగా విద్యార్థులు కాలేజీ ప్రవేశాల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. దోస్త్లో సీటు పొందిన విద్యార్థులు స్వయంగా హాజరుకాని పక్షంలో వారి సీట్లను ఫేజ్-2లో భాగంగా మెరిట్ మార్కుల ఆధారంగా ఇతర విద్యార్థులకు కేటాయిస్తామని తెలిపారు.