అత్యంత పవిత్రంగా ఆరాధిస్తున్న గోవును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి అన్నారు. గురువారం రాత్రి ఎన్టీఆర్ స్టేడియంలో గోవును పరిరక్షించాలని కోరు తూ యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గో మహాగర్జన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వేదాలు, శాస్ర్తాలు గోవు ప్రత్యేకతను చాటుతున్నాయని, గోమాతను రక్షించుకుంటే భూమాత బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో యుగతులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్, గో సంరక్షకుడు విజయరాం, పరిపూర్ణానందగిరి స్వామిజీ, పల్గుట్ట శ్రీరాములు మహరాజ్, అసంగానంద స్వామిజీ, సంత్ గణేశ్ దాస్ మహరాజ, శ్రీ పీఠానికి చెందిన పరిపూర్ణానంద స్వామిజీ, వ్రతధర రామానుజ, విద్యారణ్య భారతీ స్వామి, హరితీర్థానంద స్వామి, సింహాయాజస్వామి పాల్గొన్నారు.