శంషాబాద్, మే 20: దివ్యసాకేత పుష్కర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణ, వేదపండితుల సమక్షంలో గురువారం అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, విశ్వక్సేనారాధన, చంద్రప్రభ సేవ, దేవతాహ్వానాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామిజీ మాట్లాడుతూ ఆధ్యాత్మికతతోనే లోక కల్యాణం, సమాజ శ్రేయస్సు సాధ్యమని పునరుద్ఘాటించారు. మహాత్ముల అవతారం భగవంతుడి ప్రతిరూపాలేనని అన్నారు. వేదసారాలను.. వాటి ప్రాముఖ్యతను సమాజానికి తెలియజేయడం ఎంతో అవసరమని తెలిపారు.