ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలువీసాల దేవుడిగా ఖ్యాతిగాంచిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు బుధవారం సమాప్తమయ్యాయి.ప్రతియేటా ఆలయానికి సమీపంలోని గండిపేట జలాశయంలో చక్రతీర్థ స్నానం చేయించేవారు.కరోనా తీవ్రత నేపథ్యంలో హంగు ఆర్భాటం లేకుండా గండిపేట జలాలను గంగాలంలో తెచ్చి స్వామి వారికి అవభృత స్నానం చేయించారు.సాయంత్రం ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగిసినట్లు ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ, అర్చకుడు రంగరాజన్ ప్రకటించారు.పరావస్తు రామాచార్యులు, బాలాజీ స్వామి, కన్నయ్యస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.