తెలుగు యూనివర్సిటీ, మార్చి 11 : చిల్డ్రన్స్ ఫైన్ ఆర్ట్ గ్యాలరీ(డైరా) ఐదో ఎడిషన్లో భాగంగా చిల్డ్రన్ ఆర్ట్ ఫెస్టివల్-2021ను మార్చి 19 నుంచి 21వరకు అంతర్జాలం వేదికగా నిర్వహిస్తున్నట్లు ద చిల్డ్రన్స్ ఫైన్ ఆర్ట్ గ్యాలరీ వ్యవస్థాపక డైరెక్టర్ అతికాఅంజద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 8 నుంచి 18 ఏండ్లలోపు పిల్లలు ప్రపంచ వ్యాప్తంగా ఆన్లైన్ వేదికగా జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. ఈ ప్రదర్శనకు ప్రపంచవ్యాప్తంగా 8 వందలకు పైగా ఔత్సాహిక కళాకారుల కళాఖండాలు ఎంట్రీలుగా వచ్చాయన్నారు. కరోనా సమయంలో పిల్లలు సృష్టించిన వేలాది కళాకృతులను సేకరించి ఆర్ట్ కరోనా సీజన్ పేరుతో ఈ ప్రదర్శనలకు శ్రీకారం చుట్టామన్నారు. వర్ధమాన కళాకారులు భారతీయ సమకాలీన అంశాలతో సృష్టించిన అంశాలకు ఈ ప్రదర్శనలో చోటు కల్పించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జవహర్ బాలభవన్, ఆవిడ్ లెర్నింగ్, పీస్ ఫర్ ఇండియా సంయుక్తాధ్వర్యంలో ప్రస్తుతం 5వ ఎడిషన్లో భాగంగా కిచెన్ డ్రిల్ శీర్షికతో లాక్డౌన్ కాలంలో వంటగదిలో ప్రత్యేకంగా ఉన్న వారసత్వ వస్తువులను డాక్యుమెంట్ చేయబడి ప్రదర్శించిన వస్తువులు ఆన్లైన్ మ్యూజియంగా ఈ ప్రదర్శన కొనసాగుతుందని వెల్లడించారు. ఈవెంట్ను ఫేస్బుక్, యూట్యూబ్, సీఎఫ్ఏజీ వెబ్సైట్ ద్వారా కళాకృతులను వీక్షించి కళాకారులను అభినందించవచ్చన్నారు.