దుండిగల్, జూన్ 18: నిజాంపేట మున్సిపల్ కార్పొరేష న్ పరిధిలోని బాచుపల్లిలో నవజాత శిశు విక్రయం కలక లం సృష్టించింది. విషయం తెలుసుకున్న స్త్రీ, శిశు సంక్షేమశాఖ, చైల్డ్లైన్ అధికారులు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం శిశువును అమీర్పేటలోని శిశువిహార్కు తరలించారు. బాచుపల్లి మండలం ఐసీడీఎస్, సూపర్వైజర్ దుర్గ తెలిపిన వివరాల ప్రకారం, నగరంలోని మల్కాజిగిరి కి చెందిన రాధ, రాజు దంపతులు. రెండేండ్ల కిందట అక్కడి నుంచి తమ మకాంను నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లికి మార్చారు. బాచుపల్లి-మియాపూర్ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న గుడిసెల్లో నివాసముం టూ చిత్తుకాగితాలు ఏరుకుని, వాటిని అమ్ముకోగా వచ్చిన సొమ్ముతో జీవిస్తున్నారు. వీరి పెద్ద కూతురు లక్ష్మి ఏడాది కిందట అనారోగ్యంతో మృతి చెందింది.
ఈ క్రమంలో రాధ ఈ నెల 10న మరో ఆడశిశువుకు జన్మనిచ్చింది. అప్పటికే రాజు రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో ఏ పనిచేయలేక ఇంటికే పరిమితమయ్యాడు. దీనికి తోడు రాధ బాలింత కా వడంతో కుటుంబపోషణ ఇబ్బందిగా మారింది. దీంతో నా లుగు రోజుల కిందట రాధ తన చిన్నకూతురిని అక్కడే ఉం టున్న శాంతమ్మ అనే మహిళకు రూ.3వేలకు విక్రయించిం ది. మూడు రోజుల అనంతరం (గురువారం) రాధ తన కూ తురును తనకు ఇవ్వాలని శాంతమ్మను అడిగింది. దానికి శాంతమ్మ తనకు రూ.10 వేలు ఇస్తేనే శిశువును అప్పగిస్తానని తెలిపింది. దీంతో రాధ స్థానికంగా ఉండే అంగన్వాడీ కార్యకర్త మణిమాలను కలిసి గోడు వెళ్లబోసుకుంది. ఇదే విషయాన్ని మణిమాల ఉన్నతాధికారులకు తెలుపడంతో వారి ఆదేశానుసారం ఇంద్రానగర్ అంగన్వాడీ కేంద్రం కార్యకర్త మాధవితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరుపగా శిశువిక్రయం జరిగింది నిజమేనని తేలింది. దీంతో శిశువును అంగన్వాడీ సభ్యులు తమవద్దే ఉంచుకున్నారు.
ఇదే విషయమై బాచుపల్లి మండలం స్త్రీ, శిశు సంక్షేమశా ఖ సూపర్వైజర్ దుర్గ, అంగన్వాడీ కార్యకర్తలు విచారణ జరుపగా రాధ, శాంతమ్మలకు ఇరువురికి శిశువును సంరక్షించే స్థోమతలేదని గుర్తించి బాచుపల్లి పోలీసులకు శుక్రవా రం ఫిర్యాదు చేశారు. అనంతరం జిల్లా చైల్డ్లైన్ కౌన్సెలర్ అరుణతో కలిసి శిశువును అమీర్పేటలోని శిశువిహార్ (స్టేట్ హోం)కు తరలించారు. తనకు ముగ్గురు కొడుకులున్నప్పటికీ కూతురు లేని కారణంగానే ఆడ శిశువును కొనుగోలు చేసి, పెంచుకుందామనుకున్నానని శాంతమ్మ పేర్కొంది.