చార్మినార్, సెప్టెంబర్ 14 : అంబర్పేటలో కిడ్నాప్నకు గురైన చిన్నారిని సీసీ పుటేజీల ఆధారంగా గంటల వ్యవధిలోనే షాద్నగర్లో కనిపెట్టారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని చిన్నారిని తల్లికి అప్పగించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను మంగళవారం దక్షిణ మండల డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ గజరావ్ భూపాల్ వెల్లడించారు. అంబర్పేట్ ప్రాంతానికి చెందిన అలీ మీర్జా సోమవారం మధ్యాహ్నం చంచల్గూడ క్రాస్ రోడ్డులో తన ఆరేండ్ల కూరుతు అల్ఫియాతో కలిసి భిక్షాటన చేస్తుంది.
అదే సమయంలో ఫారుఖ్నగర్కు చెందిన అసియా అక్కడికి చేరుకుని ఇక్కడ భిక్షాటన చేస్తే కొంత మొత్తంలోనే డబ్బు వస్తుందని, హఫీజ్బాబానగర్లో జకాత్ అనే వ్యక్తి దానధర్మాలు చేస్తుంటాడు.. అక్కడికి వెళ్తే ఎక్కువగా డబ్బులు వస్తాయని అలీమీర్జాకు తెలిపింది. తనతో వస్తే జకాత్ ఇల్లు చూపిస్తానని చెప్పింది. ఇది నిజమని నమ్మిన అలీమీర్జా తన కూతురును వెంట తీసుకుని అసియాతో కలిసి ఆటోలో హఫీజ్బాబానగర్ చేరుకున్నది.
హబీబ్ ఫంక్షన్హాల్ వద్దకు చేరుకోగానే ఆటోను ఆపింది. చిన్నారిని ఇక్కడే వదిలి ఎదురుగా ఉన్న బ్లాక్గేట్లోకి వెళ్లమని మీర్జాకు తెలిపింది. ఆసియా మాటలు నమ్మిన మీర్జా డబ్బులు వస్తాయనే ఆశతో చిన్నారిని వదిలి వెళ్లగా అక్కడ నిరాశే ఎదురైంది. తిరిగి బయటకు వచ్చేసరికి చిన్నారిని తీసుకుని ఆసియా పరారైంది. ఆందోళనకు గురైన మీర్జా కాంచన్బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న కాంచన్బాగ్ పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. చిన్నారిని గాలించడానికి వెంటనే కాంచన్బాగ్ అడిషనల్ ఇన్స్పెక్టర్ కోటయ్యతోపాటు సంతోష్నగర్ అడిషనల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, కాంచన్బాగ్ ఎస్సైలు నగేశ్, సాయికుమార్, భవానీనగర్ ఎస్సై ఉపేందర్, మాదన్నపేట్ ఇన్స్పెక్టర్లతో కలిపి ప్రత్యేకంగా 6 టీంలను రంగంలోకి దింపారు. ఒక్కో టీం సభ్యులు చంచల్గూడ నుంచి హఫీజ్బాబానగర్ వరకు సీసీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు.
నిందితురాలు హఫీజ్బాబానగర్ నుంచి రెండు ఆటోలను మారి శంషాబాద్కు చేరుకుంది. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో షాద్నగర్కు చేరుకుని ఫారుఖ్నగర్కు మరో ఆటోలో వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించి అసియాను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని తల్లి మీర్జాకు అప్పగించారు. అయితే నిందితురాలిపై నేర చరిత్ర ఉన్నట్లు విచారణలో గుర్తించామని డీసీపీ తెలిపారు. కేసును ఛేదించిన పోలీసులను డీసీపీ అభినందించారు. ఈ సమావేశంలో సంతోష్నగర్ ఏసీపీ శివరామశర్మతోపాటు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.