ఇలా పండించాలి..
మల్టీలెవల్ షేడ్ నెట్లో సాగు చేస్తే.. ఇతర కాలాల్లో వచ్చే పంట దిగుబడులు వేసవిలోనూ వస్తాయి. పైగా ఖర్చు కూడా తక్కువే. రూప్టాప్, కాలమ్స్ నెట్హౌస్ రూప్టాప్ నెట్, కేబుల్ పర్లిన్ నెట్హౌస్, మేజర్గా మల్టీలెవల్ షెడ్ నెట్హౌస్లో అధిక ప్రయోజనాలు ఉంటాయి. సుమారు 460 స్కేర్ ఫీట్ల విస్తీర్ణంలో సాగు చేసే పంటకు ఒక్కో స్కేర్ ఫీట్కు రూ.200 నుంచి రూ.300 వరకు వెచ్చించి ఏర్పాటు చేసుకునే మల్టీలెవల్ షేడ్నెట్ ద్వారా గాలి ప్రసరణ, వెలుతురు మొక్కలకు సమానంగా అందుతుంది. ఈ విధానం ద్వారా బయట పండించే కూరగాయల సాగులో ఒక్కో చెట్టు నుంచి 2 కేజీలు వస్తే..మల్టీలెవల్ షేడ్ పద్ధతులతో పండించిన పంటలో ఒక్కో మొక్కకు 10 కేజీల వరకు అధిక దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఉద్యావనన అధికారులు చెబుతున్నారు. జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో ఈ పద్ధతిలో పండించిన టమాట దిగుబడి అధికంగా ఉండటం విశేషం.
ఉష్ణోగ్రతను తట్టుకొని…
తెలుగు రాష్ర్టాల్లో వేసవి వాతావరణాన్ని తట్టుకొని పండించే పంటలు తక్కువే. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకొని సాగు చేయాలంటే మాత్రం మేలైన నూతన పద్ధతులు అవలంబించడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. టమాట సాగులో అత్యధికంగా సాహో, యూఎస్440, పీహెచ్ఎస్ 448 వంటి రకాల విత్తనాలు నాటుతారు. ఇలాంటి రకమైన పంటల్లో సాధారణంగా మొక్క కేవలం 38 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉంటేనే తట్టుకుంటాయి. దీని కంటే ఎక్కువైనా.. పూత, పిందె, కాయ దశలోనే ఛిద్రమౌతుంటాయి. వేసవిలో తెలుగు రాష్ర్టాల్లో 38 డిగ్రీల కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ క్రమంలో పండించే పంట పూర్తిగా దెబ్బతినకుండా ఉండేందుకు మల్టీలెవల్ షేడ్నెట్లు రక్షణ కల్పిస్తాయని చెబుతున్నారు. షేడ్లో దారాల ఆధారంగా మొక్కులను పెంచుకొని, వాటి కింద ఇతర రకాలైన ఆకుకూరలను సేద్యం చేసుకొని, మధ్యమధ్యలో బంతిపూల సాగు వంటివి చేయడం ద్వారా ఒకే దశలో మూడు రకాలైన మేలైన పంటలను పండించుకునేందుకు ఆస్కారం ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు.
రైతులకు అవగాహన అవసరం
మల్టీలెవల్ షేడ్ నెట్ ద్వారా సాగు చేయడంపై రైతులు అవగాహన కలిగి ఉండాలి. వేసవిలో ఇలాంటి పంటల ద్వారా 80 నుంచి లక్ష రూపాయాల ఆదాయం పొందేందుకు అవకాశాలుంటాయి. ఎన్ని నూతన వంగడాలు వచ్చినా వేసవిలో ఉష్ణోగ్రతలు తట్టుకుని దిగుబడి రావాలంటే షేడ్నెట్ల వినియోగం అత్యవసరం.
వేసవిలో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయాలంటే కొంచెం కష్టమే. అత్యధిక
ఉష్ణోగ్రతను తట్టుకొని పుష్కలంగా పంట చేతికొచ్చేది గగనమే. మొక్క ఆకు.. పూత
రాలిపోతుంది. అందుకే చాలా మంది అన్నదాతలు ఈ కాలంలో తక్కువ స్థాయిలో
సాగు చేస్తారు. ఫలితంగా ఉత్పత్తి తగ్గి పోయి..డిమాండ్ పెరుగుతున్నది. మార్కెట్లలో
ధరలు కూడా అమాంతం ఎగబాకుతాయి. కాస్త భిన్నంగా ఆలోచించి..మల్టీలెవల్ షేడ్
నెట్ హౌస్’లో పంటలు వేస్తే.. అధికదిగుబడులతో పాటు లాభాలు సైతం అదే స్థాయిలో
ఆర్జించవచ్చని అంటున్నారు జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ అధికారులు.
ఇవీ కూడా చదవండీ..
ఢిల్లీలో ఐదు వేలు దాటిన రోజువారీ కరోనా కేసులు
AMB సినిమాస్లో పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డు
మహారాష్ట్రలో ఒక్కరోజే 60వేల కేసులు