ఆన్లైన్ రమ్మీ ఓ యువకుడిని బానిస చేసింది. పేకాటకు అలవాటు పడి లక్షలు పోగొట్టుకున్నాడు. చివరకు పని చేస్తున్న సంస్థకే అర కోటి టోకరా పెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఎల్బీనగర్ రాచకొండ పోలీసు కమిషనర్ క్యాంపు కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాకు చెందిన నీలప్పా నవీన్రెడ్డి బ్యాంకింగ్ సర్వీసెస్లో పీజీ డిప్లొమా పూర్తి చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్లోని డైమండ్ పాయింట్ యాక్సిస్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా చేరాడు. అక్కడ ఉద్యోగం చేసుకుంటూనే ఆన్లైన్ రమ్మీ ఆడే వాడు. ఇలా రూ.లక్షలు పేకాటలో పోగొట్టుకున్నాడు. ఆర్థిక కష్టాలు తలెత్తడంతో బ్యాంకు విధుల్లో నిర్లక్ష్యం చేశాడు. దీంతో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ తర్వాత అప్పులు చేసి మళ్లీ ఆన్లైన్ రమ్మీ ఆడాడు. అవి కూడా పోవడంతో అతడి తండ్రి మందలించి ఆ అప్పులు కట్టేశాడు.
హైదరాబాద్కు వచ్చి హయత్నగర్ పరిధిలోని జేబీ ఇన్ఫ్రా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. యాజమాన్యం నమ్మకాన్ని గెలుచుకున్నాడు. దీంతో ఇటీవల యాజమాన్యం అతడి వద్ద రూ.50.57 లక్షలు పెట్టింది. డబ్బు చూడగానే నవీన్రెడ్డి ఆలోచనలు ఒక్కసారిగా మారిపోయాయి. ఒకే రోజు రాత్రి ఆన్లైన్ రమ్మీ, క్యాసినో ఆడి దాదాపు రూ.12.27లక్షలు పోగొట్టుకున్నాడు. మరుసటి రోజు ఉదయం యాజమాన్యం డబ్బులు తీసురావాలని ఫోన్ చేయగా స్పందించలేదు. సహాయం కోసం శ్రీకాకుళంలో ఉండే అతడి మామ అమిత్రెడ్డికి ఫోన్ చేశాడు. అతను నవీన్రెడ్డిని మొత్తం డబ్బు తీసుకుని రమ్మని సలహా ఇచ్చాడు.
ఆ తర్వాత ఇద్దరు కలిసి పలాస వెళ్లి అక్కడ అమిత్రెడ్డి స్నేహితుడు రామకృష్ణకు అప్పగించి భద్రంగా ఉంచాలన్నారు. అప్పటి వరకు అతడికి రూ.5 లక్షలు ఖర్చులకు ఇచ్చారు. అనంతరం ఉత్తరాది రాష్ర్టా ల్లో విహారయాత్రలు తిరిగి విచ్చలవిడిగా ఖర్చు చేశారు. గురువారం తిరిగి హాయత్నగర్లో ఉన్న నవీన్రెడ్డి అద్దెకు ఉంటున్న గదికి వచ్చారు. అప్పటికే మాటువేసిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి దాదాపు రూ.28.29 లక్షలు రికవరీ చేశారు. ఈ సమావేశంలో డీసీపీ సంప్రీత్ సింగ్, ఏసీపీ పురుషోత్తమ్రెడ్డి, ఇన్స్పెక్టర్ సురేందర్, ఎస్ఐ రాజు, కానిస్టేబుళ్లు గోపి, రవి ఉన్నారు.