న్యూఢిల్లీ: ముగ్గురు దుండగులు ఒక వ్యక్తిని కొట్టడంతోపాటు బలవంతంగా బట్టలు విప్పించి అతడి వద్ద ఉన్నవి దోచుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. రఘుబీర్ నగర్ ప్రాంతంలో రాత్రి వేళ నిర్మాణుష్య రోడ్డులో ఒక వ్యక్తిని ఇద్దరు బెల్ట్తో కొట్టారు. అనంతరం బలవంతంగా అతడి దుస్తులు విప్పించారు. అతడి వద్ద ఉన్న డబ్బు, ఇతర వస్తువులను దోచుకున్నారు. మూడో వ్యక్తి బైక్పై ఉన్నాడు. ఈ రోడ్డుకు సమీపంలోని ప్రధాన రహదారిపై పలు వాహనాలు వెళ్లినా ఎవరూ గమనించలేదు. కాగా, స్కూటర్పై అటుగా వచ్చిన ఒక వ్యక్తి దీనిని గమనించి యూ టర్న్ తీసుకుని వెళ్లిపోయాడు.
మరోవైపు బాధితుడైన డ్రైవర్ ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దోపిడీ దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డు అయ్యాయి. వీటి ఆధానంగా పోలీసులు ముగ్గురు నిందితులను గుర్తించారు. లఖ్విందర్, దీపక్, ఆకాశ్ను అరెస్ట్ చేశారు. బాధితుడి నుంచి దోచుకున్న వాటిని వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారని పోలీసులు తెలిపారు.