చార్మినార్, జూన్ 20 : ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలను ఎత్తేయడంతో పాతనగరంలోని పర్యాటక కేంద్రాలు, మార్కెట్ ప్రాంతాల్లో సందడి నెలకొంది. చారిత్రక చార్మినార్ను తిలకించేందుకు మూడు నెలల తరువాత సందర్శకులకు అనుమతించడంతో ఆదివారం ఉదయం నుంచే పర్యాటకులు పోటెత్తారు. ఈ సందర్భంగా పలువురు సెల్ఫీలు దిగారు. ఒక్కరోజే చార్మినార్ను సుమారు 1500 మందికి పైగా సందర్శకులు తిలకించారని సిబ్బంది తెలిపారు. అలాగే.. పాతనగరంలోని మార్కెట్ ప్రాంతాలన్నీ కొనుగోలుదారులతో నిండిపోయాయి. చార్మినార్, గుల్జర్హౌస్, మదీనాతోపాటు పటేల్మార్కెట్లోనూ రద్దీ నెలకొంది.