హైదరాబాద్ : తెలంగాణలోని గురుకులాల్లో ఐదోతరగతి ప్రవేశాలకు నిర్వహించే టీజీసెట్ దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. వచ్చే నెల 10 వరకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఐదో తరగతి విద్యార్థులకు గురుకులాల్లో ప్రవేశానికి యేటా ప్రభుత్వం టీజీసెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసింది. కొవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది ప్రవేశ పరీక్ష కాస్త ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తున్నది.
ప్రస్తుత విద్యాసంవత్సరంలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రవేశ పరీక్షను మే 30న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా మొత్తం 46,937 సీట్లను భర్తీ చేయనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.