కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 26 : ఒంటరిగా ఉన్న వ్యక్తిని చితకబాది బంగారు గొలుసును తస్కరించి పారిపోయిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్, కేపీహెచ్బీ కాలనీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం… మంగళవారం ఉదయం కేపీహెచ్బీ కాలనీ టెంపుల్ బస్టాప్లో వాహనాలను తనిఖీలు చేస్తుండగా వాహన ధ్రువీకరణ పత్రాలు లేకుండా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో.. ఈనెల 20న కేపీహెచ్బీ కాలనీ బస్టాప్ సమీపంలోని కళామందిర్ వెనుకాల ఖాళీ స్థలంలో మూత్ర విసర్జన కోసం ఒంటరిగా వెళ్లిన సంతోష్ నాయక్పై దాడిచేసి గొలుసును దొంగిలించినట్లు తేలింది. సంతోష్ నాయక్పై దాడిచేసి గొలుసును దొంగిలించిన వారిలో ఎల్లమ్మబండకు చెందిన గురుగోవింద్ సింగ్ (21), సూరారం సాయిబానగర్ చౌరస్తాకు చెందిన నవీన్కుమార్ (21), కూకట్పల్లి జయానగర్కు చెందిన పులి రాంబాబు (22), కేపీహెచ్బీ కాలనీకి చెందిన టేకు నవీన్ (21) ఉన్నట్లు తేల్చారు. ఆ నలుగురిని అదుపులోకి తీసుకుని దొంగిలించిన 12 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.