హైదరాబాద్ : నగరంలోని శ్మశానవాటికల్లో అంత్యక్రియల నిర్వహణకు నిర్దేశించిన రుసుములే వసూలు చేయాలని జీహెచ్ఎంసీ సిబ్బందికి సూచించింది. దహన సంస్కారాలకు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అండటంతో మహానగర పాలక సంస్థ వెంటనే చర్యలకు ఉపక్రమించింది. అన్ని శ్మశానవాటికట్లో ఒకే రుసుము ఉండాలని నిర్ణయించింది.
నిర్దేశిత రుసుమును పేర్కొంటూ అన్ని శ్మశానవాటికల వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించింది. సాధారణ మృతుల అంత్యక్రియలకు రూ. 6 వేలు, కొవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ. 8 వేలు వసూలు చేయాలని ఆదేశించింది. అధిక రుసుము వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.