కాచిగూడ,సెప్టెంబర్ 1: ఎంఎంటీఎస్ రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికుని జేబులోంచి గుర్తుతెలియని వ్యక్తులు ఖరీదైన సెల్ఫోన్ను దొంగిలించారు. రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్సీపురం, బిహెచ్ఇఎల్ ప్రాంతానికి చెందిన వెంకటేశ్వర్రావు(59) విశ్రాంత ఉద్యోగి. మంగళవారం రాత్రి విద్యానగర్ నుంచి లింగంపల్లికి ఎంఎంటీఎస్ రైల్లో వెలుతుండగా మార్గమధ్యలో సీతాఫల్మండీ రైల్వేస్టేషన్లో గుర్తుతెలియని వ్యక్తి వెంకటేశ్వర్రావు జేబులోంచి ఖరీదైన సెల్ఫోన్ను దొంగిలించుకుని పారిపోయాడు.
బుధవారం వెంకటేశ్వర్రావు కాచిగూడ రైల్వే పోలీసులకు పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ రైల్వే పోలీసులు తెలిపారు.