శ్రీనగర్కాలనీ, ఆగస్టు 22 : ఇండి- రాయల్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్-మిస్సెస్ ఇండియా 2021 గ్రాండ్ ఫినాలే పోటీలు కనులపండవగా జరిగాయి. ఆదివారం బంజారాహిల్స్లోని ర్యాడిసన్ హోటల్లో జరిగిన ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా అర్చనశాస్త్రి, తెలుగు ఫిల్మ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. శివశంకర్, ఆర్జేలు హాజరయ్యారు. సీజన్-6 పోటీల ప్రవేశాలకు ఈ నెలలో అన్లైన్లో నిర్వహించిన ఇంటర్వ్యూలకు వివిధ రాష్ర్టాలకు చెందిన పలువురు మహిళలు పోటీపడ్డారు.
వారి దరఖాస్తులు స్వీకరించి, ఆన్లైన్లో 42 మందిని ఎంపిక చేసి మిస్- మిస్సెస్ ఇండియా ఫైనల్ పోటీలకు ఆహ్వానించారు. పోటీలకు హాజరైన 42 మంది మహిళలు వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించారు. తమ ప్రాంతాలు, రాష్ర్టాలకు సంస్కృతిని ప్రతిబింభించేలా ప్రదర్శనలో తమదైన కళారూపాలతో మహిళలు ఆకట్టుకున్నారు. అందాల ప్రదర్శనతో పాటు సామాజిక బాధ్యతను గుర్తుచేసేలా ప్లేకార్డులను చూపారు.
వివిధ రాష్ర్టాలకు చెందిన మహిళలతో పాటు తెలుగు రాష్ర్టాలకు చెందిన వారు ఉన్నారు. ఈ పోటీల్లో మిస్ ఇండియాకు విజేతతో పాటు ఫస్ట్, సెకండ్ రన్నర్లను, మిస్సెస్ ఇండియాకు ముగ్గురు, మిస్సెస్ ఇండియా క్లాసిక్కు మరో ముగ్గురిని ఎంపిక చేశారు. ప్రదర్శనను తిలకించేందుకు పలువురు ప్రముఖులు, ఫేజ్ 2 సెలబ్రిటీలు హాజరయ్యారు. కార్యక్రమంలో నిర్వహకులు రోలీ త్రిపాఠి, చావి అస్థాన, అభిషేక్, ప్రీతిరెడ్డి పాల్గొన్నారు.