న్యూఢిల్లీ : మైక్రోసాఫ్ట్ గురువారం కొత్త ఆపరేటింగ్ సిస్టం విండోస్ 11 వర్షన్ను అధికారికంగా ఆవిష్కరించింది. విండోస్ 10తో పోలిస్తే విండోస్ 11 లుక్ సరికొత్తగా ఉన్నది. స్నాప్ లే అవుట్, స్నాప్ గ్రూప్ సహా మల్టీ టాస్కింగ్కు ఇందులో వీలు కల్పించింది. ఆండ్రాయిడ్ యాప్లు కూడా ఆపరేట్ అయ్యేలా ఈ విండోస్-11ను మైక్రోసాఫ్ట్ తీసుకువచ్చింది. అదే విధంగా.. టాస్క్బార్లో ఐకాన్స్ స్థానాన్ని మైక్రోసాఫ్ట్.. చివరి నుంచి మధ్యలోకి తీసుకొచ్చింది.
విండోస్ 10 నుంచి విండోస్ 11కి ఉచితంగానే అప్గ్రేడ్ కావొచ్చని సంస్థ తెలిపింది. గత కొన్ని సంవత్సరాలుగా స్మార్ట్ ఫోన్లు, ఇతర స్మార్ట్ పరికరాలు ప్రజాదరణ పొందడంతో విండోస్.. ఆపిల్, గూగుల్ నుంచి గట్టి పోటీని మైక్రోసాఫ్ట్ ఎదుర్కొంటోందని సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. విండోస్ చరిత్రలో ఒక మైలురాయిని సూచిస్తుందన్న ఆయన.. ఇది కొత్త తరం ఆరంభమని వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు విండోస్ 10 ఓఎస్ను 2015లో మైక్రోసాఫ్ట్ విడుదల చేసింది. మళ్లీ ఆరేళ్ల తర్వాత కొత్త ఆపరేటింగ్ సిస్టంను తీసుకువచ్చింది.