సిటీబ్యూరో, జూన్1 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నేపథ్యంలో సీబీఎస్ఈ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 12వ తరగతి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో గ్రేటర్ పరిధిలోని 50 వేల మంది విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే గ్రేటర్ పరిధిలో మొత్తంగా సీబీఎస్ఈ స్కూళ్లు 181 ఉండగా.. ఇందులో అత్యధికంగా హైదరాబాద్లో 100, మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలో 1, రంగారెడ్డి జిల్లాలో 80 స్కూళ్లు ఉన్నాయి. వీటిలో చదువుతున్న 40 నుంచి 50 వేల విద్యార్థులు ప్రమోట్ కాగా.. అయితే విద్యార్థులందరికి మార్కులు ఇచ్చే విషయమై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు.