కలెక్టర్ వెంకట్రావు
రాజాపూర్, ఏప్రిల్ 26: గ్రామాల అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి ప్రతి గ్రామంలోని నర్సరీల నిర్వహణ, పల్లె ప్రకృతి వనాలను సంరక్షణను సుందరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. సోమవారం మండలంలోని ముదిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. గ్రామంలో ఉపాధిహామీ పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాలు, సెగ్రిగేషన్ షెడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారును ఆదేశించారు. గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో లక్ష్మీదేవి, ఎంపీవో వెంకట్రాములు, ఏపీవో భారతి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
వరంగల్ అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యం
ప్రైవేట్ ఉద్యోగులకు యూపీ చేసిందేమిటంటే..!