బంజారాహిల్స్,సెప్టెంబర్ 5: పార్కింగ్ స్థలంలో కారు దిగుతున్న వ్యక్తులను అతివేగంగా వచ్చి ఢీకొట్టిన బీఎండబ్ల్యూ కారు డ్రైవర్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్లోని అపర్ణా సెరెన్ పార్క్లో నివాసం ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ బి.నరేష్ శనివారం తన తండ్రి లక్ష్మారెడ్డి, సోదరి శాలినితో కలిసి బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్సత్రికి వచ్చి పార్కింగ్లో కారు అపారు.
కారులో ఉన్న వారు కిందకు దిగుతుండగానే వెనకనుంచి అతివేగంగా వచ్చిన ఓ బీఎండబ్ల్యూ కారు(టీఎస్09ఈకే 0747) వారి ఐ-10 కారును ఢీకొట్టింది. దీంతో కారులోంచి దిగుతున్న శాలినికి తీవ్రగాయాలయ్యారు. వారిని అపోలో ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. ఈ మేరకు నరేష్ ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.