కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ లక్ష్యంగా మరోసారి విమర్శలు గుప్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. దీదీ ఓ దీదీ అంటూ మరోసారి ఆమెను హేళన చేసిన మోదీ.. నందిగ్రామ్లో క్లీన్బౌల్డయ్యారని అన్నారు. ఆమె బౌల్డవడంతో మొత్తం టీమ్ను ఫీల్డ్ నుంచి బయటకు వెళ్లిపోవాల్సిందిగా అడిగారని మోదీ అనడం విశేషం.
ఇదే సందర్భంలో తృణమూల్ నినాదమైన మా, మాటి, మనుష్పై కూడా సెటైర్లు వేశారు. మాను హింసించడం, మాటి (మాతృభూమి)ని దోచుకోవడం, మనుష్ (మనుషులు)ల రక్తపాతమే ఈ నినాదానికి అసలైన అర్థమని మోదీ విమర్శించారు. బెంగాల్ ఎన్నికల్లో భాగంగా మోదీ బర్ధమాన్లో ప్రచారం నిర్వహించారు.
క్రికెట్ పరిభాషలో మాట్లాడుతూ.. ఇప్పటికే తొలి నాలుగు విడతల ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు ఎన్నో బౌండరీలు బాదారని, బీజేపీ సెంచరీ పూర్తి చేసేసిందని మోదీ అన్నారు. సగం మ్యాచ్లోనే తృణమూల్ను లేకుండా చేసేశారని చెప్పారు. దీదీని నందిగ్రామ్లో క్లీన్బౌల్డ్ చేసి ఆమె మొత్తం టీమ్ను ఫీల్డ్ నుంచి వెళ్లిపోవాలని చెప్పారని అన్నారు.
కేంద్ర బలగాలపైకి ప్రజలను రెచ్చగొట్టి పంపించే ప్రయత్నం మమతా బెనర్జీ చేశారని మోదీ ఆరోపించారు. ఈసారి మమతా ఓడిపోయిన తర్వాత మళ్లీ అధికారంలోకి ఎన్నటికీ రాదని ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
అదానీతో చేతులు కలిపిన వాల్మార్ట్.. ఇండియాలో అతిపెద్ద వేర్హౌజ్ నిర్మాణం!
సన్రైజర్స్ను చీర్ చేసిన ఈ మిస్టరీ గర్ల్ ఎవరో తెలుసా?
లవ్ జిహాద్ నిజం.. ఇండియాను హిందూ దేశంగా ప్రకటించండి: పీసీ జార్జ్
క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఆ రికార్డుకు 17 ఏళ్లు
ఐపీఎల్లో నైట్రైడర్స్ 100వ విజయం.. షారుక్ఖాన్ రియాక్షన్ ఇదీ
రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్కు బాఫ్టా నివాళులు
కొవిడ్ భయాలు.. దారుణంగా పతనమైన స్టాక్ మార్కెట్
కరోనా కల్లోలం.. ఇండియాలో కొత్తగా 1.69 లక్షల కేసులు
సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్!