ప్రభుత్వ పాఠశాలల్లో తొలగనున్న సమస్యలు
కొవిడ్ సమయంలో కూడా నిధుల విడుదలపై హర్షం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రూ.5.91 కోట్లు
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 15 :కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా తెలంగాణ సర్కారు నిధుల విడుదల ఆపడం లేదు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి, మౌలిక వసతులకు డబ్బులు విడుదల చేస్తున్నది. ఇందులో భాగంగానే బడుల బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నది. కార్పొరేట్కు దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నది. ఇటీవల బడ్జెట్లో కూడా విద్యకు రూ.4వేల కోట్లు కేటాయించింది. తాజాగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 2,759 పాఠశాలలు ఉండగా.. రూ.5.91 కోట్లు కేటాయించింది. వీటిని పాఠశాలల్లోని మౌలిక వసతుల కల్పనకు వినియోగించనున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 2,759 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి కాంపోజిట్ నిధులు విడుదల చేసింది. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు కలిపి 5 కోట్ల 91 లక్షల 56 వేల 250 రూపాయలు విడుదల చేసింది. వీటిని ప్రభుత్వ పాఠశాలల్లోని స్టేషనరీ, విద్యుత్ చార్జీలు, ఇతర అభివృద్ధి పనులకు వినియోగించనున్నారు. ఫలితంగా పాఠశాలల్లో మౌలి క సమస్యలు దూరం కానున్నాయి. కొవిడ్ సమయంలో సర్కారు నిధులు విడుదల చేయడంతో హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ జిల్లాలో 709 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. రూ.1,56,56,250 విడుదలయ్యాయి. ఇందులో ఎస్సీ కేటగిరీ కింద 24 శాతం నిధుల్లో రూ.37,57,500, ఎస్టీ 14 శాతం రూ.21,97,875, జనరల్ 62 శాతం ప్రకారం రూ.97,06,875లు విడుదల అయ్యాయి.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 691 బడులు ఉండగా.. రూ.1,39,78,125 విడుదలయ్యాయి. ఇందులో ఎస్సీ కేటగిరీ కింద 24 శాతం నిధుల్లో రూ.33,54,750, ఎస్టీ 14 శాతం రూ.19,56,937, జనరల్ 62 శాతం ప్రకారం రూ.86,66,438 లు విడుదల అయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లాలోని 664 పాఠశాలలకు రూ.1,56,7
5,000 విడుదలయ్యాయి. ఇందు లో ఎస్సీ కేటగిరీ కింద 24 శాతం నిధుల్లో రూ.37,62,000, ఎస్టీ 14 శాతం రూ.21,94, 500, జనరల్ 62 శాతం ప్రకారం రూ.97, 18,500 రూపాయలు విడుదల అయ్యాయి.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల జిల్లాలోని 695 ప్రభుత్వ పాఠశాలలకు రూ.1,38, 46,875 విడుదలయ్యాయి. ఇందులో ఎస్సీ కేటగిరీ కింద 24 శాతం నిధుల్లో రూ.33,23,250, ఎస్టీ 14 శాతం రూ.19,38,853, జనరల్ 62 శాతం ప్రకారం రూ.85,85,062 రూపాయలు కేటాయించారు.