నారాయణఖేడ్, ఏప్రిల్ 18: కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో అధికారులు క్షేత్రస్థాయిలో అవసరమైన చర్యలు చేపడుతున్నారు. నారాయణఖేడ్ పట్టణంలోని పలు కాలనీల్లో హైపోక్లోరైడ్ రసాయనాన్ని పిచికారీని ఆదివారం ముమ్మరంగా చేపట్టారు. వివేకానందకాలనీ, నెహ్రూనగర్, శాస్త్రీనగర్తో పాటు పలు కాలనీల్లోని వీధుల్లో హైపోక్లోరైడ్ను పిచికారీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మున్సిపల్ చైర్పర్సన్ రుబినాబేగం నజీబ్, ఇన్చార్జ్ మున్సిపల్ కమిషనర్, ఆర్డీవో అంబాదాస్ రాజేశ్వర్ ఆదేశాలమేరకు హైపోక్లోరైడ్ను పిచికారీ చేస్తున్నట్లు చెప్పారు. కాలనీల్లోని ప్రజలను కరోనాపై అప్రమత్తం చేస్తూ తగు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు.
ఇవి కూడా చదవండి
పాపులర్ హీరోతో ఫైట్ చేయనున్న బాలయ్య
జడ్చర్ల మున్సిపాలిటీకి 241 నామినేషన్లు దాఖలు