కరోనా నేపథ్యంలో ప్రస్తుతం నగరంలో చాలా మంది ప్రజలు ప్రయాణాలకు క్యాబ్లనే ఆశ్రయిస్తున్నారు. రద్దీగా ఉండే ప్యాసింజర్ ప్రయాణాలకు దూరంగా ఉండటానికి క్యాబ్లనే ఎంచుకుంటున్నారు. అయితే, ఇటీవల అధిక సంఖ్యలో క్యాబ్ డ్రైవర్లకు కొవిడ్ సోకింది. జనం వివిధ కారణాల వల్ల క్యాబ్లను బుక్ చేసుకుంటున్నారు. కరోనా లక్షణాలు ఉన్నప్పటికి క్యాబ్లలో ప్రయాణం చేస్తున్నారు. పలు కారణాలతో క్యాబ్ డ్రైవర్లు కరోనా బారినపడాల్సి వస్తుంది. ఇటీవల 549 మంది క్యాబ్ డ్రైవర్లు కొవిడ్ బారినపడ్డారు. 311 మంది డ్రైవర్లు మరణించారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే క్యాబ్ డ్రైవర్లు కరోనాతో మృతి చెందుతుండటం బాధాకరం. యాప్ ఆధారిత క్యాబ్ సర్సీసులు అందిస్తున్న వీరికి యాజమాన్యాల నుంచి ఎటువంటి సహకారం అందడం లేదు. కనీసం పీపీఈ కిట్లు కూడా సమకూర్చడం లేదు. ఇలాంటి క్లిష్ట సమయంలో వృత్తి నిర్వహిస్తున్న డ్రైవర్లను ఓలా, ఊబర్లు పట్టించుకోవాలని వాహన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
క్లిష్ట సమయంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే డ్రైవ ర్ల గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇది చాలా బాధాకరం. డ్రైవర్లను కంపెనీలు ఆదుకోవాలి. కొవిడ్తో మరణించిన వారికి రూ.25 లక్షలు కంపెనీ చెల్లించాలి. కొవిడ్తో బాధపడే వారికి రోజుకు రూ.1,175లు అందివ్వాలి. – షేక్ సలావుద్దిన్, ప్రెసిడెంట్, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫాం వర్కర్స్ యూనియన్
కొవిడ్ సోకుతుందని తెలిసినా ఉపా ధి కోసం వాహనం నడపక తప్పని పరిస్థితులు మావి. క్లిష్ట సమయంలో ప్రజలకు సేవలందిస్తున్నాం. మేము కొవిడ్ బారిన పడితే కంపెనీలు ఆదుకోవడం లేదు. ఇంట్లో ఉం టే ఈఎంఐలు చెల్లించలేము. కేంద్రం మారటోరియం అమలు చేయాలి. – మురళీమోహన్, క్యాబ్ డ్రైవర్