అంబర్పేట, ఆగస్టు 27 : మొబైల్ వ్యాక్సినేషన్, ఇంటింటి సర్వే అంబర్పేట నియోజకవర్గంలో ముమ్మరంగా సాగుతున్నది. నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో డివిజన్కు పది బృందాలు ఇంటింటికి వెళ్లి టీకా వేసుకున్నారా? లేదా? అని సర్వే చేస్తున్నారు. ఇంట్లో వారందరు టీకా వేసుకుంటే వ్యాక్సినేషన్ పూర్తయిందని తెలిపే స్టిక్కర్ను అతికిస్తున్నారు. ఎవరైనా టీకా తీసుకోకుంటే వారిని కేంద్రానికి తీసుకెళ్లి టీకా వేయిస్తున్నారు.
ఇప్పటి వరకు అంబర్పేట సర్కిల్లో 49 కాలనీ, బస్తీలు పూర్తిగా టీకా తీసుకున్న కాలనీలుగా అధికారులు ప్రకటించారు. అలాగే 4,568 మందికి టీకాలు వేసినట్లు అధికారులు చెప్పారు. కొన్ని బస్తీలను కలిపి దగ్గరలో ఉన్న కమ్యూనిటీహాల్ వద్ద మొబైల్ టీకా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. సర్కిల్లోని అన్ని బస్తీలు, కాలనీలను టీకాలు పూర్తయిన కాలనీలుగా చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని అధికారులు తెలిపారు.