మాదాపూర్, జూన్ 2: యువ ఇంజినీర్లకు అండగా నిలిచేందుకు టాలెంట్ స్ప్రింట్, కో పోర్బ్లు ముందుకొచ్చాయి. బిజినెస్ ప్రాసెస్ ఆటోమేషన్ విధానంలో లో కోడ్ ప్లాట్ఫాం నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ఫాస్ట్ట్రాక్ ఆటోమేషన్ సమ్మర్ స్కూల్ పేరిట ఓ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. 2020-21లో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండి.. టెక్, బీఈ (సీఎస్సీ, ఐటీ, ఈసీఈ) లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. శిక్షణ పొందాలనుకునే యువ ఇంజినీర్ల నుంచి జూన్ 7 నుంచి నిర్వాహకులు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మరింత సమాచారం కోసం 9959154371, 9963980259 నంబర్లలో సంప్రదించవచ్చని సూచిస్తున్నారు.