న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: సూపర్ ప్రీమియం సెగ్మెంట్లో సుజుకీ మోటర్సైకిల్ ఇండియా మార్కెట్లోకి సరికొత్త హయబూసా బైక్ను తీసుకొచ్చింది. ఢిల్లీ ఎక్స్షోరూం ప్రకారం దీని ధర రూ.16.40 లక్షలుగా ఉందని సోమవారం సంస్థ ప్రకటించింది. గడిచిన 13 ఏండ్లలో ఎప్పుడూ లేనివిధంగా తొలిసారి పూర్తి మార్పులతో ఈ బైక్ను పరిచయం చేస్తున్నట్లు పేర్కొంది. హిల్ హోల్డ్ కంట్రోల్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లతో ఈ బైక్ను అందుబాటులోకి తెచ్చామని ఓ ప్రకటనలో సుజుకీ మోటర్సైకిల్ ఇండియా ఎండీ కోయిచిరో హిరావ్ తెలిపారు. ముందుగా లక్ష రూపాయలను చెల్లించి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని, వచ్చే నెల మధ్య నాటికి బైక్ను అందుకోవచ్చన్నారు.