ముషీరాబాద్, మార్చి 19: పేద, బలహీన వర్గాలకు మేలు చేసేలా, వేగవంతంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావులు బడ్జెట్ను ప్రవేశపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముషీరాబాద్ డివిజన్ పార్శిగుట్ట చౌరస్తాలో శుక్రవారం సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ చిత్రపటాలకు ఎమ్మెల్యే ముఠాగోపాల్, టీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠాగోపాల్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలోచనా విధానాల అమలుకు అనుకూలమైన బడ్జెట్ రూపకల్పన చేసి ఆర్థిక మంత్రి హరీశ్రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారని తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సాగు, తాగు, విద్యా, వైద్య రంగాలకు మెరుగైన కేటాయింపులు చేసి కీలక రంగాలను బలోపేతం చేసే చర్యలు చేపట్టారని అన్నారు. బడ్జెట్లో వ్యవసాయ రంగం, పల్లె ప్రగతికి అధిక ప్రాధాన్యతనిచ్చారని, ఎస్సీ, ఎస్టీలు, బీసీల సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందేలా బడ్జెట్ రూపకల్పన చేశారని అన్నారు. కరోనా కష్ట కాలంలోనూ అన్నివర్గాల ప్రజలకు మేలు చేసే బడ్జెట్ ప్రవేశపెట్టారని అన్నారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు టీ.సోమసుందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ముఠా జయసింహ, మల్లేశ్యాదవ్, ఎయిర్టెల్ రాజు, లక్ష్మణ్గౌడ్, బాల్రాజ్గౌడ్, జీ.రాజు, అజయ్ ముదిరాజ్, బియ్యం శ్రీను పాల్గొన్నారు.
సీఎం రిలీప్ ఫండ్ చెక్కు అందజేత..
అనారోగ్యంతో బాధపడుతూ శస్త్ర చికిత్స చేయించుకోవడానికి ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్న రాంనగర్కు చెందిన హరిశంకర్కు ఎమ్మెల్యే ముఠాగోపాల్ సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన లక్ష రూపాయల ఆర్థిక చేయూతనందించే లేఖను(ఎల్ఓసీ) అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సుధాకర్గుప్తా, మాధవ్, సయ్యద్ అస్లాం, రవియాదవ్, నేత శ్రీనివాస్, శ్యామ్, నాగులు, భాస్కర్రావు పాల్గొన్నారు.
సాయిబాబా ఆలయ సందర్శన..
అడిక్మెట్ డివిజన్ బహుదూర్నగర్ సాయిబాబా దేవాలయంలో దొంగతనం జరిగిన నేపథ్యంలో ఎమ్మెల్యేగోపాల్ శుక్రవారం ఆలయాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులతో మాట్లాడి చోరీ జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. త్వరగా నిందితులను పట్టుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.