వరంగల్ : జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహ స్వామి, వల్మిడి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాల అభివృద్ధిపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం వరంగల్ లోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఆ రెండు దేవాలయాల్లో అభివృద్ధి పనులు కుంటు పడుతున్నాయి. అవి వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఆయా పనుల ప్రస్తుత పరిస్థితులు తెలుసుకున్నారు. ఎప్పటిలోగా అవి పూర్తి కావాలో కూడా మంత్రి అధికారులకు సూచించారు. నిధుల కొరత లేదు. అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు.
అనంతరం వల్మిడి గ్రామ సర్పంచ్ కత్తి సైదులు, ఎంపీటీసీ తాళ్ల సోమనారాయణ, దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు మంత్రిని కలిశారు. శ్రీరామ నవమి రోజు జరిగే కల్యాణ మహాత్సవానక రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీతారామచంద్ర స్వామి కల్యాణోత్సవ పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు.
ఇవి కూడా చదవండి..
రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలి
జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి : మంత్రి శ్రీనివాస్గౌడ్
గ్రామీణాభివృద్ధిలో స్థానిక సంస్థల పాత్ర కీలకం : ఎమ్మెల్సీ కవిత
తేనెటీగల దాడిలో ఏడుగురికి గాయాలు