వెంగళరావునగర్, జూన్ 18 : పురిటి నొప్పులతో అల్లాడుతున్న ఓ నిండు చూలాలి పట్ల పోలీసులు మానవత్వం చాటుకున్నారు. బోరబండ సైట్ త్రీ సాయిబాబానగర్కు చెందిన మునీర్ భార్య ఫరానా బేగంకు గురువారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో పురిటినొప్పులు వచ్చాయి. బోరబండ బస్టాండ్కు రాగా.. ఆటోలు కనిపించలేదు. దాంతో మునీర్ బోరబండ ఔట్ పోస్టు పోలీసులకు విషయం చెప్పడంతో వెంటనే స్పందించారు. ఫర్హానాబేగంను పోలీసులు సాయిప్రసాద్, శ్రవణ్ పోలీస్ వ్యాన్లో ఎక్కించి నిలోఫర్ దవాఖానకు తరలించారు.