సుల్తాన్బజార్/సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ దవాఖానల్లో పేద రోగులకు విశేషమైన సేవలను అందిస్తున్న వైద్యుల సేవలు వెలకట్టలేనివని మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ పేర్కొన్నారు. శనివారం ఈఎన్టీ దవాఖాన ఆడిటోరియంలో హెచ్ఆర్డీఏ ఆధ్వర్యంలో దవాఖానలోని వైద్యులకు,ఎస్ఆర్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన డీఎంఈ రమేశ్రెడ్డితో కలిసి సూపరింటెండెంట్ డాక్టర్ తాటి శంకర్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రవిశంకర్ ప్రజాపతి ,ప్రొఫెసర్, సీనియర్ రెసిండెంట్,పీజీలకు శాలువా మెమోంటోతో ఘనం గా సన్మానించారు.కార్యక్రమంలో హెచ్ఆర్డీఏ ప్రతినిధులు జి.శ్రీనివాస్, నిమ్స్ హెచ్వోడీ భూషణ్,హెల్త్ కేర్ రిఫార్మ్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ మహేశ్, డాక్టర్ శ్రీనివాస్, కోశాధికారి డాక్టర్ ఆనంద్ పాల్గొన్నారు.