సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తేతెలంగాణ): స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని పంజాగుట్ట మెట్రోస్టేషన్లో బుక్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు తెలిపారు. ఈ ప్రదర్శన ఆదివారం సాయంత్రం వరకు ఉంటుందని, ప్రవేశం ఉచితమని చెప్పారు. బుక్ ఫెయిర్లో విలియం షేక్స్పియర్, హారీ పోటర్, అగాథ క్రిస్టీ, రస్కిన్ బాండ్, జెఫ్రీ ఆర్చర్, కెన్ పోలెట్ తదితర రచయితల పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు.