వినాయక్నగర్, జూలై 12: ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులను చేపడుతామని జోనల్ కమిషనర్ మమత అన్నారు. సోమవారం అల్వాల్ సర్కిల్ కార్యాలయంలో డీసీ నాగమణితో పాటు అధికారులతో హరితహారం, బోనాల పండుగ, ఆలయాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ మాట్లాడుతూ బోనాల పండుగను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జరుగుతున్న డ్రైనేజీ పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. పెండింగ్ పనులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని కార్పొరేటర్లు సబితాకిశోర్, రాజ్ జితేంద్రనాథ్ వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈఈ రాజు, డీఈలు మహేశ్, కార్తీక్, ఏఎంహెచ్వో నిర్మల, లక్ష్మి, రవళి తదితరులు పాల్గొన్నారు.