మెహిదీపట్నం, జూలై 9 : గోల్కొండ బోనాల ప్రారంభోత్సవానికి రావాలంటూ శుక్రవారం ట్రస్టు కమిటీ సభ్యులు హోంమంత్రి మహమూద్ అలీ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, ఎమ్మెల్యే రాజాసింగ్, డీజీపీ మహేందర్రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, నగర జాయింట్ కమిషనర్, పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్.శ్రీనివాస్లకు ఆహ్వాన పత్రికలను అందచేశారు. కార్యక్రమంలో ట్రస్టు కమిటీ చైర్మన్ కోయల్కార్ గోవింద్రాజ్, ఆలయ ఈవో ఎస్.మహేందర్కుమార్, కార్వాన్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి ఠాకూర్ జీవన్సింగ్, అడహక్ కమిటీ సభ్యులు కె.శేఖర్ రెడ్డి, సభ్యులు హేమలత, స్వరూపరాణి, నాయకులు జగదీశ్యాదవ్,రవికాంత్ పాల్గొన్నారు.
చార్మినార్, జూలై 9 : ఆషాఢ బోనాలను వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిందని భాగ్యనగర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు బత్తుల బల్వంత్ యాదవ్ తెలిపారు. సోమవారం వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారని తెలిపారు. ఆగస్ట్ 1న నగరంలో నిర్వహించే బోనాల సందర్భంగా ఆలయాలకు విచ్చేసే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వ విభాగాలు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారని బల్వంత్ యాదవ్ తెలిపారు.
చాంద్రాయణగుట్ట, జూలై 9 : బోనాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయాల వద్ద అభివృద్ధి కార్యక్రమాలను మొదలు పెట్టాలని కోరుతూ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు బి.బల్వంత్ యాదవ్ ఆధ్వర్యంలో వివిధ ఆలయాల కమిటీ సభ్యులు శుక్రవారం చార్మినార్ మున్సిపల్ జోనల్ కమిషనర్ నామా సామ్రాట్ అశోక్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బల్వంత్ యాదవ్ మాట్లాడుతూ.. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అభివృద్ధి పనులపై జోనల్ కమిషనర్తో చర్చించామన్నారు. త్వరలోనే అమ్మవారి ఆలయాల వద్ద పనులు ప్రారంభిస్తామని జడ్సీ తెలిపారని ఆలయాల కమిటీల సభ్యులు అన్నారు. కార్యక్రమంలో దూద్బౌలిలోని నీరు ముత్యాలమ్మ ఆలయం చైర్మన్ ఆనంద్గుప్తా, అధ్యక్షుడు వెంకటాచలం, లాల్దర్వాజ ఆలయ చైర్మన్ కె.వెంకటేశ్, కోశాధికారి జి.అరవింద్ కుమార్గౌడ్ పాల్గొన్నారు.